హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి ఐటీ సోదాల కలకలం

  • కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్‌ ఇంట్లో నేడు ఐటీ సోదాలు
  • తెల్లవారుజామునే సోదాలు మొదలెట్టిన అధికారులు
  • గతంలోనూ షానవాజ్‌పై ఐటీ దాడులు 
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో మరోసారి ఐటీ సోదాల కలకలం రేగింది. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. గతంలో షానవాజ్ దుబాయ్‌లో ఉన్న సమయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తాజాగా నేడు తెల్లవారుజామున నుంచే ఈ సోదాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో రెండు సార్లు షానవాజ్‌పై ఐటీ దాడులు జరిగాయి.

IT Raids
Hyderabad

More Telugu News